ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై తమ ప్రభుత్వ వైఖరి ఏంటో, విధానమేంటో ప్రజలకు, కార్మికులకు స్పష్టం చేయాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనీయబోమని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, ఇప్పుడు ప్లాంట్కు సంబంధించి వేగంగా జరుగుతున్న పరిణామాలకు సమాధానం చెప్పాలని కోరారు.
కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడం, పండుగ బోనస్ ఇవ్వక పోవడం, బలవంతపు వీఆర్ఎస్ అమలు చేస్తుండటం, బ్లాస్ట్ ఫర్నేస్లు వరుసగా మూసి వేస్తుండటం వంటి పరిణామాలు చూస్తుంటే.. ఉక్కు పరిశ్రమ భవిష్యత్తుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. శనివారం విశాఖపట్నంలో మాజీ మంత్రి అమర్నాథ్తో కలిసి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేతకు నిర్ణయం తీసుకున్నారా? కేంద్రం చేస్తున్న ప్రైవేటీకరణను సమర్థిస్తున్నారా? సెయిల్లో విలీనం చేస్తారా?. అసలు ఏం చేయబోతున్నారు? వీటన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని మండలి విపక్షనేత డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యే పెట్టేలా, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడుతూ రాజకీయాలు చేయొద్దని, ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అనుసరిస్తే ఈ ప్రాంత ప్రజలు ఉపేక్షించబోరని హెచ్చరించారు. విశాక స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయాలు చేసే ఉద్దేశం తమకు లేదన్న బొత్స.. ‘ఆంధ్రుల హక్కు–విశాఖ ఉక్కు’ అనే నినాదంతో ఉన్న సెంటిమెంట్కు భంగం కలిగించే పనిలో భాగం కావొద్దని సూచించారు. జగన్గారు సీఎంగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్లో కార్మికుల తొలగింపు, ఫర్నేస్ల మూసివేత, వీఆర్ఎస్ ఇవ్వడం వంటివి చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. నాడు కేంద్ర ప్రభుత్వ కూటమిలో లేకపోయినా, స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలని కేంద్రాన్ని కోరామన్న ఆయన, అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీజేపీని డిమాండ్ చేసే స్థాయిలో ఉందని గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa