రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా నియంతలు హిట్లర్, గడాఫీల తరహాలో పాలన కొనసాగుతోందని.. మరోవైపు అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు, హింస పెరిగిపోయాయని పుత్తా శివశంకర్రెడ్డి ఆరోపించారు. రేపిస్టులు, రౌడీలు, గూండాలు యథేచ్ఛగా తిరుగుతున్నా అరెస్టు చేయడానికి సంశయిస్తున్న పోలీసులు, ప్రభుత్వ తప్పుడు చర్యలను ప్రశ్నిస్తున్న తమ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ మీద మాత్రం ప్రతాపం చూపిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ తన అఫీషియల్ అకౌంట్లలో మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్, ఆయన కుటుంబం గురించి అత్యంత నీచంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే, ఆ పోస్టులపై సుమోటోగా చర్యలు తీసుకుని.. అలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న చంద్రబాబు, నారా లోకేశ్లను విచారించవచ్చు కదా అని ప్రశ్నించారు.
రెండేళ్ల క్రితం వైయస్ విజయమ్మ కారు ప్రమాదానికి గురైతే టైరు మార్చుకుంటున్న ఫోటోలు టీడీపీ తన అధికారిక ఖాతాలో పెట్టి తల్లిని చంపడానికి వైయస్ జగన్ కుట్ర చేశాడని రాస్తే వారి మీద ఒక్క కేసైనా నమోదు చేశారా అని నిలదీశారు. మరోవైపు ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని గతంలో ప్రకటించిన పవన్కళ్యాణ్, వారి పాలన వైఫల్యాలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేయిస్తామని బెదిరించడం సమంజసం కాదని స్పష్టం చేశారు. లోకేశ్ రెడ్ బుక్ పాలన ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో డెత్ బుక్ అవుతుందని పుత్తా శివశంకర్రెడ్డి హెచ్చరించారు. 4వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు చాలా మందికి జీతాలు పడలేదన్న ఆయన, మరి ప్రభుత్వం ఈ నాలుగున్నర నెలల్లో చేసిన రూ.60 వేల కోట్ల రుణం ఏమైందని ప్రశ్నించారు. తమది మంచి ప్రభుత్వం అని గప్పాలు కొట్టుకుంటున్న ప్రభుత్వం అవినీతిపై ప్రశ్నిస్తే భయపడి అరెస్ట్లు చేస్తోందని కొమ్మూరి కనకారావు ఆక్షేపించారు. జగన్గారు ఒక్క పిలుపునిస్తే పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు రోడ్లమీద కొస్తారని, వారిని భయపెట్టడానికి అరెస్టులు చేస్తూ పోతే, పోలీస్ స్టేషన్లు కూడా సరిపోవని ఆయన హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa