రైల్వే స్టేషన్లో సూట్కేసులో మహిళ మృతదేహం బయటపడిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. నెల్లూరు, చైన్నై సెంట్రల్ మధ్య నడిచే సబర్మన్ ఎలక్ట్రికల్ ట్రైన్ మింజూర్ రైల్వే స్టేషన్ కు రాగానే ఓ సూట్కేసు ప్లాట్ఫాంపై పడింది. రైలు కదలడానికి ముందే సూట్కేసు కింద పడటం గమణించిన కానిస్టేబుల్ మహేష్.. వారిని అడ్డుకున్నారు. సూట్కేసు నుంచి రక్తం కారడం చూసి దానిని తెరిచి చూడటంతో అసలు నిజం వెళుగులోకి వచ్చింది. ఓ మహిళ మృతదేహం బయటపడింది.
దీనిపై ఆర్పీఎఫ్ సిబ్బంది(RPF) నిలదీయడంతో తామే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితులను తండ్రీ కూతుర్లుగా పోలీసులు గుర్తించారు. తమ కూతురును వ్యభిచారంలోకి దించేందుకు ప్రయత్నిచడంతో హత్య చేసినట్లు నిందితులు తెలిపారు. మృతురాలిని మన్యం రమణిగా గుర్తించిన పోలీసులు.. చెన్నైలో నిందితుల ఇంటి సమీపంలో నివాసం ఉంటుందని తెలుసుకున్నారు. మహిళ మెడలో 50 గ్రాముల బంగారం ఉందని, దానిని అపహరించి కడ్డీలుగా మర్చారని, అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని మింజూర్ రైల్వే స్టేషన్ లో పడేసేందుకు తరలించారని పోలీసుల విచారణలో తేలింది. నిందితులు నెల్లూరుకు చెందిన సుబ్రమణ్యం, కూతురు దివ్యశ్రీ అని, వీరు చెన్నై లో నివాసం ఉంటున్నారని పోలీస్ అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa