సోదాల పేరుతో పార్టీకి చెందిన మహిళా నేతలు ఉన్న గదుల్లోకి పోలీసులు ప్రవేశించడం సరికాదని ఏఐసీసీ అగ్రనాయకురాలు, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రియాంక గాంధీ అన్నారు. కేరళలోని వయనాడ్, పాలక్కాడ్ నియోజకవర్గాల్లో మరికొన్ని రోజుల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. దీంతో పలువురు కాంగ్రెస్ మహిళా నేతలు పాలక్కాడ్లో ఉంటున్నారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త బ్యాగ్తో లోనికి వెళ్లారు.ఇది సీసీటీవీలో రికార్డ్ అయింది. నల్లధనాన్ని తీసుకువెళుతున్నారనే అనుమానాలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ కేరళ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు హోటల్కు వెళ్లి... సోదాలు నిర్వహించారు.ఈ ఘటనపై ప్రియాంక గాంధీ స్పందించారు. సోదాల పేరుతో అర్ధరాత్రి సమయంలో మహిళలు ఉన్న గదుల్లోకి పోలీసులు వెళ్లడం తప్పు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. మరోవైపు, హోటల్ నుంచి నల్లధనం తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa