ఏపీలో ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి ..భయపడేది లేదని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు పెట్టిన అసభ్యకర పోస్టులపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి.. ప్రొద్దుటూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా రాచమల్లు మీడియాతో మాట్లాడుతూ.. నాపై గతంలో అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము. కూటమి ప్రభుత్వం ఎంతమందిపై కేసులు పెడతారో పెట్టుకోండి. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తాము. మా పార్టీ ప్రతి కార్యకర్త, నాయకులకు మేము అండగా ఉంటాము అని హామీ ఇచ్చారు. అలాగే, కూటమి నేతల అబద్ధాలను ఎండగడతాం. ప్రజలకు అన్ని నిజాలు తెలుస్తున్నాయని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa