ఏపీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది.. టికెట్పై 25శాతం రాయితీ ప్రకటించింది.. కాకపోతే సీనియర్ సిటిజన్స్కు మాత్రమే వర్తిస్తుంది. ఈ టికెట్ రాయితీ అమలు కోసం ఆరు రకాల గుర్తింపు కార్డులను ప్రకటించింది.. ఈ మేరకు ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ రాయితీ ఆంధ్రప్రదేశ్లోని అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో వర్తిస్తుంది.. దేశంలో అన్ని రాష్ట్రాల సీనియర్ సిటిజన్లకు ఏపీలో 25% బస్సు టికెట్లపై రాయితీ లభిస్తుంది. ఈ రాయితీ పొందాలంటే సీనియర్ సిటిజన్స్ తమ వయసుకు సంబంధించిన గుర్తింపు కార్డుల్ని ఆర్టీసీ బస్సుల్లో చూపించాల్సి ఉంటుంది.
సీనియర్ సిటిజన్స్ బస్సుల్లో టికెట్లపై 25శాతం రాయితీని పొందడానికి ఆరు రకాల కార్డుల్లో ఏదైనా ఉపయోగించొచ్చని ఆర్టీసీ ఆదేశాల్లో తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన గుర్తింపు కార్డులు ఏవైనా పర్లేదు. ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డ్, పాస్పోర్టు, పాన్ కార్డు, రేషన్ కార్డులను అనుమతిస్తారు. ఆర్టీసీ అధికారులు ఈ ఆరు కార్డుల్ని రాయితీ కోసం అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సీనియర్ సిటిజన్లు ఈ రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు ఆర్టీసీ అధికారులు.
మరోవైపు ఏపీఎస్ఆర్టీసీకి 2024 ఏడాదికిగానూ ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు దక్కింది. యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు, బస్సుల్లో డిజిటల్ టికెట్లు, కాగిత రహిత టికెట్ల జారీ జారీ చేస్తున్నందుకు ఈ అవార్డు ఏపీఎస్ఆర్టీసీని వరించింది. అంతేకాదు బస్సుల్లో ట్రాకింగ్ వ్యవస్థను సమర్థంగా నిర్వహిస్తున్నందుకు ఆర్టీసీని ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఆర్టీసీ ఈడీ రవివర్మ, ఐటీ చీఫ్ ఇంజినీర్ వి సుధాకర్ అందుకున్నారు.
మరోవైపు ఏపీఎస్ ఆర్టీసీ కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేకంగా బస్సుల్ని నడుపుతోంది. పంచారామక్షేత్రాలతో పాటుగా శ్రీశైలంకు స్పెషల్ బస్సులు నడుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలో నుంచి బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే ఇవాళ కార్తీక పౌర్ణమి కావడంతో శైవ క్షేత్రాలన్నీ రద్దీగా ఉన్నాయి.. ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సుల్ని ఏర్పాటు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa