వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దొంగ కేసులు పెడితే మేం ఊరుకోమని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆర్కే రోజా.. అన్నారు. సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టిన కూటమి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చెవి రెడ్డి మోహిత్ రెడ్డి తదితర నేతలు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని విమర్శించారు.. మహిళలపై నీచాతి నీచంగా పోస్టులు పెడుతున్నారు.. ఫిర్యాదు చేస్తే రిప్లే ఇవ్వడానికే వందసార్లు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు తప్పులు చేసి ఎదుటి వారిపై బురద చల్లడం అలవాటు అని మండిపడ్డారు. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబుకు అలవాటే అన్నారు. సీఎం హోదాలో జగన్ ఉన్న సందర్భాల్లోనే నీచమైన పోస్ట్ లను పెట్టారు. ఇప్పుడు వైసీపీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సుధారాణి ఆడపిల్ల అని చూడకుండా పోలీసులు ఎలా కొట్టారో కోర్టులో తెలిపారు. కడపలో సునీత వాళ్ల ఇంటికి అర్థరాత్రి వెళ్లి హింసించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పచేస్తే కేసులు పెట్టండి, అలాగని దొంగకేసులు పెడితే మేము ఊరుకోం అని హెచ్చరించారు. వైసీపీ హయంలో 36 వేలమంది మిస్ అయ్యారు అని పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు.. కానీ, అసెంబ్లీ సాక్షిగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 36 మందే అని హోం మినిస్టర్ తెలిపారు.. మరి దీనికి కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa