ఏపీలో మద్యం ధరలు తగ్గబోతున్నాయనే చర్చ జరుగుతోంది. కొన్ని మద్యం బాటిల్స్ క్వార్టర్పై ఏకంగా రూ.50 తగ్గుతుందని.. డిసెంబర్ 1 నుంచి కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయనే ప్రచారం నడుస్తోంది. మూడు ప్రముఖ మద్యం కంపెనీలు.. ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలను తగ్గించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఆమోదం తెలిపి వెంటనే ఆ ధరలను అమల్లోకి వస్తాయంటున్నారు.
రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రూ.230 నుంచి రూ.210 వరకు తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఫుల్ బాటిల్ అయితే రూ.920 నుంచి రూ.840కి తగ్గుతుందంటున్నారు. మాన్షన్ హౌస్ క్వార్టర్ ధర రూ.220 నుంచి రూ.190కి తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. అదే హాఫ్ ఫుల్ బాటిల్ అయితే రూ.440 నుంచి రూ.380కి.. ఫుల్ బాటిల్ ధర రూ.870 నుంచి రూ.760కి తగ్గే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అలాగే యాంటీక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ధర రూ.1,600 నుంచి రూ.1,400కు తగ్గే అవాకశం ఉందంటున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మద్యం ధరలపై విమర్శలు రావడంతో అప్రమత్తం అయ్యారు. ఈ మేరకు మద్యం ధరలపై ఓ కమిటీని నియమించింది. త్వరలో ఈ కమిటీ అన్ని బ్రాండ్ల కంపెనీలతో ధరలను తగ్గించాలని చర్చలు జరపబోతున్నట్లు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా కొత్త ధరలు అమల్లోకి వస్తాయి అంటున్నారు. కానీ కొన్ని ప్రముఖ కంపెనీలు కమిటీ నిర్ణయించక ముందే ధరలు తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు బ్రాండ్లతో పాటుగా మరో రెండు ప్రముఖ కంపెనీలు కూడా ధరలు తగ్గించే అవకాశం ఉందంటున్నారు.
మరోవైపు ఏపీలో మద్యం షాపులు దక్కించుకున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము 20శాతం మార్జిన్ వస్తుందని అనుకుంటే.. 10శాతం మాత్రమే వస్తోందని చెబుతున్నారు.. ఈ మేరకు విజయవాడలో సమావేశం పలు తీర్మానాలు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని.. మార్జిన్ పెంచేలా చూడాలంటూ వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఇలాగైతే తాము వ్యాపారం చేయలేమంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa