ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్ర సీఎం ఎవరనేది నిర్ణయం జరిగిపోయింది.. అజిత్ పవార్

national |  Suryaa Desk  | Published : Sun, Dec 01, 2024, 10:01 PM

ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజుల గడిచిపోయినా.. ఇంకా మహారాష్ట్రకు కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అనేది సస్పెన్షన్ కొనసాగుతోంది. సీఎం ఎంపిక విషయమై మహాయుతిలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. సీఎం పదవి విషయంలో ఏక్‌నాథ్ షిండే వెనక్కితగ్గడం లేదు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవి గురించి ఎన్సీపీ నేత అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచే సీఎం అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, శివసేన (షిండే), ఎన్సీపీల నుంచి ఒక్కొక్కరు డిప్యూటీ సీఎం అవుతారని చెప్పారు.


మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీలు 230 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అత్యధికంగా 132 స్థానాల్లో బీజేపీ గెలుపొంది అతిపెద్ద పార్టీగా నిలిచింది. షిండే సేన 57, ఎన్సీపీ 41 సీట్లు గెలిచాయి. మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లుండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ 145.


తనకు మరోసారి సీఎంగా అవకాశం ఇవ్వాలని షిండే కోరుతున్నారు. బిహార్ ఫార్ములాను మహారాష్ట్రలోనూ అమలు చేయాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని నిర్ణయించే అంశంపై కూటమి నేతలు ఢిల్లీలో వరుసగా భేటీ అయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లతో బీజేపీ అధిష్ఠానం చర్చించింది.


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో జరుగుతోన్న జాప్యంపై మీడియా అడిగిన ప్రశ్నకు అజిత్ పవార్ బదులిస్తూ.. మహారాష్ట్రలో ఇలా జరగడం మొదటిసారి కాదు. 1999 ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు నెల రోజుల పట్టిందని గుర్తుచేశారు. ‘ఢిల్లీలో జరిగిన సమావేశంలో బీజేపీ ముఖ్యమంత్రి నాయకత్వంలో మహాయుతి ప్రభుత్వ ఏర్పడుతుందని నిర్ణయించారు.. కూటమిలోని శివసేన, ఎన్సీపీలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కతాయి.. అయితే ఇంకా మంత్రిత్వ శాఖల కేటాయింపులు జరగలేదు ’ అని ఆయన ఆయన స్పష్టం చేశారు. ఫలితాలు రాగానే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్2కు అజిత్‌ పవార్‌ మద్దతు పలికిన విషయం తెలిసిందే.


మరోవైపు, డిసెంబరు 5న సాయంత్రం 5 గంటలకు ముంబయిలోని ఆజాద్‌ మైదానంలో మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుతీరబోతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవ్‌నకులే వెల్లడించారు. ఈ ప్రమాణస్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు హాజరవుతారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేస్తారనేది మాత్రం చంద్రశేఖర్‌ వెల్లడించలేదు. ఇక, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. రెండు రోజుల కిందటే తన సొంతూరుకు వెళ్లిపోవడంతో ఆయన అలకభూనినట్టు ప్రచారం జరుగుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com