అనంతపురం రూరల్మండలంలోని ఉప్పరపల్లి పొలంలో పేదలకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక పేదలతో కలిసి సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ...రూరల్లోని ఉప్పరపల్లి పొలం సర్వే నెంబర్ 194-8లో సుమారు 250 మంది వరకూ కొన్నేళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారన్నారు. ఇది వంక పోరంబోకు కాదని గ్రామకంఠం భూమి అన్నారు. ఈ సర్వేనెంబర్లోని పేదలకు ఇళ్లపట్టా లు ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆర్డీఓ కేశవనాయుడికి వినతిపత్రం అందించారు. సీపీఐ నగర సహాయ కార్యదర్శి రమణ, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి సంతోష్కుమార్, నగర సహాయ కార్యదర్శి అల్లిపీరా, ఇతర నాయకులు ఖాజా హుస్సేన, జయలక్ష్మి, వరలక్ష్మి, కృష్ణుడు, రాజు, సుందర్రాజు, జిలాన,భాష, మునాఫ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa