ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ చీకటి కమ్ముకుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2024, 07:13 PM

వైయ‌స్ జగన్‌ ప్రభుత్వంలో విద్యా విధానానికి స్వర్ణ యుగమని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి పేర్కొన్నారు. పేద విద్యార్థుల త‌ల్లుల‌కు ఐదేళ్ల పాటు కుంటులేకుండా  అమ్మబడి ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ చీకటిని కమ్ముకుందని ఆయ‌న ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మబడి ఇస్తానని చెప్పిన టీడీపీ ప్రభుత్వం.. ఈ సంవత్సరం అమ్మఒడి ఇవ్వకుండా ఎత్తేశారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు ఆరు నెలలు పూర్తి కావస్తోన్నా ఎలాంటి హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ ఆరు నెలల కాలంలో  ప్రభుత్వం చేసిన తప్పులు చాలా ఉన్నాయ‍న్నారు.


ఈ మేరకు బుధవారం వైయ‌స్ఆర్ జిల్లాలో రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి  మీడియాతో మాట్లాడారు.సమాజానికి అత్యంత అవసరమైన విద్య విషయంలో ప్రభుత్వం క్షమించడానికి వీలులేనంత తప్పు చేస్తోంది. అక్షరాభ్యాసం పెంచాలని గతంలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంత ప్రయత్నం చేశాడో.. ఈ ఆరు నెలలకాలంలోనే కూటమి ప్రభుత్వం అంత నిర్లక్ష్యం చేసింది.కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మబడి ఇస్తానని చెప్పారు. ఈ సంవత్సరం అమ్మఒడి ఇవ్వకుండా ఎత్తేశారు. వైఎస్‌ జగన్‌ హయాంలోని ‘నాడు-నేడు’ చాలా గొప్ప పథకం. రాష్ట్ర ఎల్లలు దాటి భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని ప్రశంసించారు. ఇప్పుడు నాడు నేడు అనే స్కీమే ఎత్తేశారు. 8వ తరగతి వారికి ఇచ్చే ట్యాబ్‌ల  పథకం అటకెక్కింది.  వైయ‌స్‌ జగన్‌  ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయడం విద్యార్థులకు శాపంలా మారింద‌ని రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com