తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు.. టీటీడీలో తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. క్యూలైన్లను పరిశీలిస్తూ భక్తుల అభిప్రాయాలను తెలుసుకుంటున్న ఆయన.. బుధవారం తిరుమలలోని దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తిరుమలలోని వరాహస్వామి గెస్ట్ హౌస్ వద్ద ఉన్న దుకాణాలు, హాకర్ లైసెన్సులను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాదారుల లైసెన్సులను పరిశీలించారు. లైసెన్సుల పరిశీలనలో ఆక్రమణలను గుర్తించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆక్రమణలను తొలగించాలని టీటీడీ అధికారులను ఆదేశించారు.
అలాగే దుకాణదారులకు కూడా కీలక సూచనలు చేశారు. దుకాణాదారులు టీటీడీ తమకు కేటాయించిన స్థలంలోనే వ్యాపారాలు చేసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలు చేసి భక్తులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. మరోవైపు మంగళవారం కూడా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సామాన్య భక్తుల క్యూలైన్లను పరిశీలించారు. ఏటీజీహెచ్ వద్ద ఉన్న స్లాటెడ్ సర్వ దర్శనం ప్రవేశ మార్గాన్ని పరిశీలించారు. అలాగే నారాయణగిరి షెడ్లను పరిశీలించారు. అనంతరం దివ్య దర్శనం క్యూలైన్లను తనిఖీ చేశారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్లో టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీల సందర్భంగా కొందరు భక్తులు తిరుపతి లడ్డూలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. తిరుమల శ్రీవారి లడ్డూలు రుచికరంగా, నాణ్యంగా ఉన్నాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు తెలియజేశారు. మరికొంతమంది భక్తులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంలో మరింత త్వరగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. దీంతో క్యూలైన్ల విధానం, దర్శన సమయం వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన ఏర్పాట్లు చేస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వారికి హామీ ఇచ్చారు. బుధవారం దుకాణాదారుల లైసెన్సులను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa