ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మామిడికి పంటల బీమా అమలు చేసేందుకు వ్యవసాయ బీమా సంస్థను ఎంపిక చేసింది. అనంతపురం జిల్లాలో 15%, విజయనగరం, కాకినాడ, ఎన్టీఆర్, నెల్లూరు, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో 16.77%.. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో 17.74%, అనకాపల్లి, ఏలూరు, నంద్యాల జిల్లాల్లో 16.08% చొప్పున సగటు ప్రీమియంగా నిర్ణయించారు. రుణాలు తీసుకునే వారితోపాటు రుణాలు లేని రైతులకు స్వచ్ఛందంగానే పంటల బీమా పథకం అమలు చేస్తారు. ఈమేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులిచ్చారు.
మరోవైపు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఎవరైనా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిస్తే.. తానే స్వయంగా అక్కడికి వెళ్తానని చెప్పారు. ధాన్యం సేకరణను సులభతరం చేశామని.. నిధులు కూడా అందుబాటులో ఉంచామన్నారు. కానీ అధికారులు, ఉద్యోగుల వైఫల్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే సహించేది లేదన్నారు. ధాన్యానికి సంబంధించి తేమ సమస్యను పరిష్కరించేందుకు ఆలోచన చేయాలని.. బియ్యం రీసైక్లింగ్, స్మగ్లింగ్ మాఫియాలా ఉందన్నారు. ఈ మేరకు అధికారులు ప్రణాళికతో పనిచేయాలని.. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేవించారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు కూడా ఇబ్బంది పడొద్దని.. సమస్యలు రాకుండా సేకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు చంద్రబాబు. అలాగే ఐవీఆర్ఎస్ విధానం ద్వారా రైతుల నుంచి సమాచారం సేకరిస్తామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఏ మిల్లుకైనా పంపొచ్చని.. 24 నుంచి 48 గంటల్లోనే డబ్బుల్ని రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నామని తెలిపారు. అలాగే రైతులు వాట్సప్ ద్వారా పంట అమ్ముకునే సౌకర్యం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. తేమ సమస్యకు డ్రయ్యర్లతో ఆరబెట్టొచ్చని.. ఏ రైస్ మిల్లరయినా రైతులకు సహకరించకుండా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. వాహనాలకు జీపీఎస్ విధానం అమలు చేయాలని.. లోడింగ్, అన్లోడింగ్కు ఎక్కువ సమయం పట్టకుండా చూడాలి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa