కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగి.. ప్రధానమంత్రి షేక్ హసీనా దేశాన్ని విడిచి పారిపోయిన తర్వాత అక్కడ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే అప్పటి నుంచి భారత్తో ఆ దేశం సంబంధాలు దిగజారుతూ వస్తున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్లోని హిందువులపై హింసాత్మక దాడులు పెరుగుతుండటం పట్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలకు తావిస్తున్న వేళ.. తాజాగా ఆ దేశం మరోసారి భారత్తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈసారి ఏకంగా భారత సరిహద్దుల్లో టర్కీ నుంచి తీసుకున్న డ్రోన్లను మోహరించడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్ సమీపంలో బంగ్లాదేశ్ డ్రోన్లను మోహరించినట్లు వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన భారత సైన్యం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిఘాను పెంచింది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న పరిస్థితులు రాను రాను తీవ్ర ఉద్రిక్తంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో బైరక్టార్ టబీ-2 కిల్లర్ డ్రోన్ను బంగ్లాదేశ్ ఆర్మీ మోహరించడం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో బంగ్లాదేశ్ సైన్యం భారీగా మోహరించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం ఆ ప్రాంతం భారత్లో చాలా సున్నితమైనంగా పరిగణిస్తున్నారు. టర్కీకి చెందిన ఈ టీబీ-2 డ్రోన్ చాలా శక్తివంతమైందని చెబుతారు. ఇది దాడి చేయడం మాత్రమే కాకుండా.. గూఢచర్యం చేయడంలో కూడా సహాయపడుతుందని తెలుస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.
ఇక ఈ టీబీ-2 డ్రోన్లను బంగ్లాదేశ్లో 67వ ఆర్మీ నిఘా కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని బంగ్లాదేశ్ రక్షణ అవసరాల కోసం మోహరించామని చెప్పినప్పటికీ.. అత్యాధునిక డ్రోన్లను సున్నితమైన ప్రాంతాల్లో మోహరించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత నెలకొన్న వేళ.. ఆ పరిస్థితిని ఉపయోగించుకుని పలు ఉగ్రవాద గ్రూపులు, స్మగ్లింగ్ నెట్వర్క్లు భారత్లోకి చొరబడుతున్నాయని పలు నివేదికలు చెబుతున్న వేళ.. ఈ డ్రోన్ల మోహరింపు జరగడం హాట్ టాపిక్గా మారింది. షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత.. సరిహద్దుల్లో భారత వ్యతిరేక చర్యలు కూడా పెరిగాయి. దీంతోపాటు రాజకీయ అస్థిరత నేపథ్యంలో భారత సరిహద్దుల వద్ద అత్యాధునికమైన యూఏవీ విస్తరణ, మరింత నిఘా అవసరమని ఓ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు.
ఇక బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యం ఇప్పటికే అప్రమత్తం అయింది. సరిహద్దుల్లో బంగ్లాదేశ్ తాజాగా డ్రోన్లను మోహరించడాన్ని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో కౌంటర్ డ్రోన్ ఆపరేషన్లను కూడా మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు భారత్ నిఘాను కూడా ఉపయోగిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa