రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజ్సమంద్ జిల్లా దేసూరి నాలాలో ఆదివారం ఉదయం పాఠశాల విద్యార్థులతో చార్భుజ నుంచి రణక్పూర్కు వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతిచెందగా, 24 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, గాయపడ్డ విద్యార్థులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa