ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని, రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని వైయస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతోందని సీఎం చంద్రబాబు చెబితే.. ఈరోజు కొన్ని పత్రికలు మాత్రం మాట మార్చి అవకతవకలు, తప్పులు జరుగుతున్న మాట వాస్తవమే కానీ, అవి గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల అంటూ వారి చేతకానితనాన్ని తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. నెల్లూరులో మీడియాతో కాకాణి గోవర్థన్రెడ్డి మాట్లాడారు. ఏదైతేనేం.. ఈనాడులో వచ్చిన కథనం చూస్తే ప్రభుత్వ అసమర్థతను అంగీకరించిందని అర్థమవుతుంది.
కానీ చంద్రబాబు అసమర్థతను దాచిపెట్టి వాస్తవాలను వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందే తప్ప, రైతులకు మేలు చేసేలా వ్యవహరించడం లేదు. వైయస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టి వేధించడంలో ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యల పరిష్కారంపై లేదని మేం చెప్పిన మాటలే నిజమయ్యాయి. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా రూ.13,500కు బదులు రూ.20 వేలు ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు చేయడం లేదు. అసలు దాని గురించి ఏ నాయకుడూ మాట్లాడడం లేదు. వారు చెప్పిన అన్నదాత సుఖీభవ అనేది చివరికి చంద్రబాబు సుఖీభవ అన్నట్టుగా మారింది. మద్ధతు ధర దక్కకపోవడానికి వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని చెప్పిన మీ మాటలే నిజమైతే.. ఈ ఆరు నెలలు ప్రక్షాళన చేయకుండా గాడిదలు కాస్తున్నారా?. చంద్రబాబు పదే పదే చెప్పే 40 ఏళ్ల అనుభవం, టెక్నాలజీ, రియల్ టైం గవర్నెన్స్, డీప్ టెక్ ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa