ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెడితే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2024, 07:07 PM

రాజమహేంద్రవరంలో దళిత యువకుడు పులి సాగర్‌పై పోలీసులు అమానవీయంగా వ్యవహరించిన ఘటనలో బాధ్యులైన పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత యువకుడితో కలిసి వైయ‌స్ఆర్‌సీపీ ప్రతినిధి బృందం, ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కిషోర్‌ మక్వానా, జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్‌పర్సన్‌ విజయభారతి సాయానీని కలిసి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మాజీ ఎంపీలు మార్గాని భరత్, గోరంట్ల మాధవ్‌తో కలిసి, పోలీసు బాధిత యువకుడు పులి సాగర్‌ తనపై జరిగిన దౌర్జన్యాన్ని జాతీయ ఎస్సీ కమిషన్, ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వివరించారు. నగరంలోని ఒక కాలనీలోని స్థానిక సమస్యపై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెడితే, ప్రకాశ్‌నగర్‌ పోలీసులు తనను స్టేషన్‌కు పిలిపించి, అర్ధనగ్నంగా సెల్‌లో నిలబెట్టారని, పైగా అక్కడ మహిళా కానిస్టేబుళ్లను కాపలాగా పెట్టారని పులి సాగర్‌ తెలిపారు.


తన విద్యార్హతలు, కులంతో పాటు ఇతర వివరాలతో స్టేట్‌మెంట్‌ తీసుకున్న తర్వాత, సీఐ ఎస్‌కె బాజీ తీవ్ర దుర్భాషలాడారని, కులం పేరుతో దూషించారని.. చివరకు హతమారుస్తామని కూడా బెదిరించారని చెప్పారు. పార్టీ ఓటమితో సైకోగా మారి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశానంటూ, పోలీసులు ఒక కాగితంపై రాసి, తనతో బలవంతంగా సంతకం చేయించుకున్నారని పులి సాగర్‌ వెల్లడించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa