చిత్తూరు జిల్లాలోని యాదమరి మండలం పాచిగుంట గ్రామంలో దారుణం జరిగింది. ప్రేమికుడి వేధింపులు తాళలేక వివాహిత మైనర్ బాలిక ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన కీర్తన (17) కు 6 నెలల క్రితం తన మామ కొడుకు రాజశేఖర్తో వివాహం జరిగింది. అయితే బాలిక మైనర్ కావడంతో ఆమెను తల్లిదండ్రులు ఇంటిలోనే ఉంచుకున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన వసంత కుమార్తో బాలికకు పరిచయం ఏర్పడింది.బాలిక వద్ద రెండు సవరాల బంగారం తీసుకున్న వసంత కుమార్.. బాలికను వేధింపులకు గురిచేశాడు. దీంతో అతని వేధింపులు తాళలేక బావిలోకి దూకి కీర్తన బలవన్మరణానికి పాల్పడింది. బావి వద్ద కీర్తన చున్నీ, చెప్పులను తల్లిదండ్రులు గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు, ఎంఆర్ఓ సమక్షంలో 40 అడుగుల లోతు ఉన్న బావి నుంచి బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు.అయితే మామకొడుకుతో పెళ్లికాక ముందు నుంచే అదే గ్రామానికి చెందిన వసంతకుమార్ అనే వ్యక్తితో బాలికకు పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో బాలికను అతడు తరచూ వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే బాలికకు మేనమామ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేసిన తల్లిదండ్రులు.. ఆ తరువాత బాలికను కుటుంబ సభ్యులు బయటకు వెళ్లనీయలేదు. అయితే బాలికకు వసంత కుమార్ నుంచి వేధింపులు మాత్రం ఎక్కువయ్యాయి. బాలికకు చెందిన వెండి పట్టీలు, బంగారు ఆభరణాలను వసంతకుమార్ తీసుకున్నాడు. తనకు ఆ వస్తువులు ఇచ్చేయాలని బాలిక పదే పదే కోరింది.అయితే ఆ వస్తువులను ఇచ్చేది లేదని, తనను పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ వసంత కుమార్ పట్టుబడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కీర్తన అర్ధరాత్రి సమయంలో స్థానికంగా ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే బాలిక కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు బావి వద్ద బాలికు చెందిన చెప్పులు, చున్నీ ఉండటాన్ని గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారి సమక్షంలో బావిలో ఉన్న కీర్తన మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa