శ్రీకాకుళం జిల్లాలో దొంగ నోట్ల కలకలం మొదలైంది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. దింతో దొంగ నోట్ల కేసులో ప్రధాన నిందితుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో శ్రీకాకుళం పోలీసులు గురువారం భీమవరం చేరుకున్నారు.నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని తీసుకుని శుక్రవారం రాత్రి శ్రీకాకుళం బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న దొంగ నోట్లు ముఠా సభ్యులు.. సదరు పోలీసుల వాహనాన్ని వెంబడించారు. అదను చూసి.. ఆ పోలీస్ వాహనంపై దాడి చేశారు.ఆ తర్వాత పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన నిందితుడిని.. తమ వాహనంలోకి ఎక్కించుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆ క్రమంలో వారిని పట్టుకొనేందుకు గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa