మన రాజ్యాంగ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు, రాజ్యాంగ నిర్మాతల కృషిని మట్టిపాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను ఆ పార్టీ అర్థం చేసుకోలేదన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా లోక్ సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో మోదీ మాట్లాడారు. మన రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు.రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు కాంగ్రెస్ ఎన్నో విధాలుగా ప్రయత్నించిందని విమర్శించారు. రాజ్యాంక శక్తి, ప్రజల ఆశీర్వాదం తమకు ఉన్నాయన్నారు. తమ పరిపాలనను చూసి ప్రజలు తమకు వరుసగా అవకాశాలు ఇస్తున్నారని తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా రాజ్యాంగ పరిరక్షణకు అండగా ఉంటామన్నారు. ఈ దేశాన్ని ఒక కుటుంబం 55 ఏళ్లు పాలించిందని, ఆ కుటుంబమే ఈ దేశానికి ఎన్నో విధాలుగా నష్టం చేసిందన్నారు. రాజ్యాంగ మార్పుపై రాష్ట్రాల సీఎంలకు నెహ్రూ లేఖ రాశారని పేర్కొన్నారు. ఆయన తప్పు చేస్తున్నాడని బాబూ రాజేంద్ర ప్రసాద్ చెప్పారని వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు రాజ్యాంగానికి 75 సార్లు సవరణలు చేశారని మోదీ అన్నారు. ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులను కాలరాశారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మందిని జైళ్లకు పంపించారని, కోర్టుల నోరు, పత్రికల గొంతు నొక్కేశారన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదోన్నతిని కూడా అడ్డుకున్నారని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అనేక కుట్రలు చేశారని ధ్వజమెత్తారు. సోనియా గాంధీ కీలక నిర్ణయాలు తీసుకునేవారని మాజీ ప్రధాని మన్మోహన్ అన్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa