ప్రస్తుత ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్న సమయంలో ఆయనను కస్టోడియల్ టార్చర్కు గురి చేసిన కేసులో రిటైర్డ్ ఏఎస్పీ విజయ్పాల్ను ప్రకాశం జిల్లా ఎస్పీ రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అయితే, ఈ విచారణలో విజయ్పాల్ నోరు విప్పలేదని తెలిసింది. మరోవైపు.. రఘురామను హత్య చేసేందుకు వైసీపీ హయాంలో కుట్ర జరిగిందని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనిపై ఇప్పటికే అనేక మంది సాక్షులను విచారించారు. 2021, మే 14న సీఐడీ అధికారులు రఘురామపై కేసు నమోదు చేశారు. ఆ కేసును విచారిస్తున్న అప్పటి గుంటూరు సీఐడీ ఓఎ్సడీగా ఉన్న విజయ్పాల్ బృందం మే 13నే హైదరాబాద్ వెళ్లింది.
అంటే కేసు నమోదు చేయకుండానే వెళ్లడంలో కుట్రకోణం స్పష్టమవుతోందని విచారణ అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా రఘురామ ఆపరేషన్ చేయించుకున్నాడని తెలిసి కూడా ఆయన గుండెలపై కూర్చొని బలంగా కొట్టడం కూడా హతమార్చాలనే ఉద్దేశంతోనే జరిగి ఉంటుందని అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఆ సమయంలో రఘురామకు భద్రతా విధులు నిర్వహించిన 10 మందిని సాక్షులుగా ఉంచి వారి సమక్షంలో సీఐడీ మాజీ ఏఎస్పీ పాల్ను ఎస్పీ దామోదర్ విచారించినట్లు తెలిసింది. అయితే వాళ్ల సమక్షంలో అడిగిన ప్రశ్నలకు పాల్ తెల్లముఖం వేశారు. రఘురామపై జరిగిన కస్టోడియల్ టార్చర్ను గుంటూరు సీఐడీ ఆఫీ్సలో ఫోన్లో చిత్రీకరించింది ఎవరు? ఎవరికి చూపించారనే అంశాలను విచారణాఽధికారి రాబట్టేందుకు ప్రయత్నం చేయగా పాల్ నుంచి తెలియదని సమాధానం వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా విజయ్పాల్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న విధంగా పోలీసులు సుమారు 29మందిని విచారించి సాక్ష్యాధారాలను సేకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa