రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎ్సఎస్) చీఫ్ మోహన్ భగవత్ శనివారం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ, ఆలయ ఈవో కె.ఎస్. రామారావు, అర్చకులు స్వాగతం పలికారు. కాగా, భవానీ దీక్షల విరమణను పురస్కరించుకుని భక్తులకు ఆలయంలో జరిగే వివిధ ఆర్జిత సేవలు, ఇతరత్రా సమాచారాన్ని తెలియజేసేందుకు రూపొందించిన దుర్గగుడి యాప్ను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 21 నుంచి 25 వరకు భవానీ దీక్షల విరమణకు వచ్చే భవానీ భక్తులు ముందస్తు బుకింగ్లు, సమాచారం, కౌంటర్లు, పార్కింగ్, టాయిలెట్లు, వైద్య శిబిరాలు, తదితర వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa