ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2024, 09:45 AM

మహిళలు స్త్రీనిధి రుణాలను ఉపయోగించుకుని చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. స్త్రీనిధి 18వ సర్వసభ్యసమావేశం సందర్భంగా నిర్వహించిన పర్చువల్‌ సమావేశానికి విజయనగరం నుంచి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సెర్ప్‌ సీఈవో వీరపాండ్యన్‌, స్త్రీ నిధి ఎండీ జివిబీడి హరిప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌ మాట్లాడుతూ స్త్రీనిధి రుణాలు తీసుకుని, పెద్దఎత్తున వ్యాపారాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బ్యాంక్‌లకు ధీటుగా స్త్రీనిధి పనిచెయ్యాలన్నారు. స్ర్తీనిధి రుణాలను ఎక్కువ మొత్తంలో ఉపయోగించుకోవాలని, ప్రతి మహిళా లక్షాధికారి కావాలని ఆకాక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపట్టిన విజన్‌ -2047లో మహిళలు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎ.కళ్యాణ చక్రవర్తి, స్ర్తీనిధి ఏజీఎం ఎ.ఉమామహేశ్వరావు, డీపీఎంఐబీ బి.బంగారమ్మా, స్త్రీనిధి మేనేజర్లు, ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa