ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విదేశాలలో తెలుగు భాషా బోధనకు ఏర్పాటు చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2024, 09:45 AM

సాంస్కృతిక కళాసారధి (సింగపూర్‌ సంస్థ) ఆధ్వర్యంలో 6 ఖండాల నుంచి 40 దేశాల తెలుగు సంస్థల ప్రతినిధులతో రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ,సెర్ప్‌,ఎన్‌ఆర్‌ఐ వ్యవహరాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ శనివారం మధ్యాహ్నాం మూడు గంటల పాటు ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. జూమ్‌లో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వివిధ దేశాల్లో నివసించే ప్రవాసాంద్రుల పరిస్థితులను, కష్టానష్టాలను మంత్రి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆదేశాలతో తెలుగు ఎన్‌ఆర్‌ఐల సమస్యలను పరిష్కరించేందుకు, ప్రవాసీయులతో సంబంధాలు మెరుగుపరిచేందుకు ఈ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామన్నారు. అన్ని దేశాల తెలుగు సంస్థలను కలుపుతూ ఒక సమూహం ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో కలెక్టరేట్‌కు అనుబంధంగా ఎన్నారైలకు సహకారం అందిచేందుకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విదేశాలలో తెలుగు భాషా బోధనకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఏపీ ఎన్‌ఆర్‌టిఎస్‌ సంస్థ కూడా ఆ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడానికి ముందుకు వచ్చి ప్రత్యేక సహకారాన్ని అందించారు. సాంస్కృతిక కళాసారధి అధ్యక్షుడు కవుటురూ రత్నకుమార్‌ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగు సంస్థలన్నీ ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో పని చేయడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమానికి ప్రధాన సమన్వయ కర్త, వ్యాఖ్యాతగా రాధిక మంగిపూడి వ్యవహరించారు. కార్యక్రమంలో ఆస్ర్టేలియా, న్యూజిలాండ్‌, సింగపూర్‌; మలేషియా, థాయలాండ్‌, బ్రూన్‌, ఇండోనియేషియా, వియత్నం, హాంకాంగ్‌, జపాన్‌ తదితర దేశాలకు చెందిన తెలుగు ప్రతినిధులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa