ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. గ్రాట్యుటీ రూ.25 లక్షలకు పెంపు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2024, 09:04 PM

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది మోదీ సర్కార్. ఇప్పటికే డియర్‌నెస్ అలవెన్స్ ను పెంచింది. ప్రస్తుంత డీఏ 53 శాతానికి చేరిన సంగతి తెలిందే. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, ఎంటీఎన్ఎల్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంచింది. కంబైన్డ్ సర్వీస్ ఫ్రేమ్‌వర్క్ కింద పెన్షన్‌కి అర్హులైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌ ఉద్యోగులు అర్హుల. డీఏ 50 శాతం దాటిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గ్రాట్యుటీని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచినట్లు తెలిపాయి. సవరించిన కొత్త పరిమితి జనవరి 1, 2024 నుంచే అమలులోకి వస్తుందని పేర్కొన్నాయి.


డీఏ 50 శాతం దాటిన తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ విభాగం ఈ ఏడాది 30వ తేదీన ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్యాట్యుటీ పరిమితిని రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం జనవరి 1, 2024 నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. మరోవైపు నిబంధనల ప్రకారం డీఏ 50 శాతానికి చేరిన క్రమంలో ఇతర అన్ని అలవెన్సులను 25 శాతం మేర పెంచినట్లు తెలిపింది. రిటైర్మెంట్ గ్రాట్యుటీ పెంపును ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగులకు సైతం వర్తింపజేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.


బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగులకు పెంచిన గ్రాట్యుటీ పరిమితి రూ. 25 లక్షలు వర్తిస్తుందా లేదా అనే విషయంపై తాజాగా కేంద్ర సమాచారా, ప్రసారాల మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ క్లారిటీ ఇచ్చాయి. ఈ రెండు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల పెన్షన్ అనేది పెన్షన్స్ రూల్స్ 2021లోని రూల్ 37 కిందకు వస్తుందని తెలిపాయి. వారికి సైతం గ్రాట్యుటీ లిమిట్ రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు స్పష్టం చేశాయి. ' డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ చెల్లింపు కోసం రేట్లు డీఓపీ పీడబ్ల్యూ 28/03/2024 గ్రాట్యుటీ 9559 తేదీ 30.05.2024లోని పేరా 3 ప్రకారం సవరించబడతాయి. డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ గరిష్ఠ పరిమితి రూ.25 లక్షలు. ఇది జనవరి 1, 2024 నుంచి అమలులోకి వస్తుంది' అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తన ఆఫీసు మెమోరాండమ్‌లో పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa