ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచన లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2024, 09:05 PM

వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరుగుతుంది. 2027లోనే జమిలి ఎన్నికలు వస్తాయ‌ని, ఈ  ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఉత్త‌రాంధ్ర రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌, ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.  మహిళలకు 33శాతం రిజర్వేషన్లు వస్తాయి. అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పెరుగుతాయి. మూడు స్థానాల్లో ఒక స్థానం మహిళకు వస్తుంది. మహిళలకు వైయ‌స్ జగన్ తగిన ప్రాధాన్యం ఇస్తార‌ని ఆయ‌న పేర్కొన్నారు. విశాఖ నగరంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయ సాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్, వైయ‌స్ఆర్‌ విగ్రహాలకు పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండ‌లి విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పార్టీ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమర్నాథ్, బుడి ముత్యాల నాయుడు , ధర్మశ్రీ, వదురు కళ్యాణి, ఎంపీ తనూజ రాణి, కేకే రాజు, మళ్ళ విజయ ప్రసాద్, వాసుపల్లి గణేష్, కాయల వెంకట రెడ్డి, చెంగల వెంకట్రావు, కొండ రాజీవ్, తైనల విజయ కుమార్, చొక్కాకుల వెంకట రావు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా ఎంపీ విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ..‘ఉత్తరాంధ్రకు తిరిగి రావడం చాలా సంతోషం. గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయం వేదికగా విజయం సాధించామో మళ్ళీ అదే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓడిపోయామనే ఆందోళన అవసరం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరితో కలిసి ముందుకు సాగాలి. కార్యకర్తలకు వైయ‌స్ జగన్ అండగా ఉంటారు. వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారు. నిత్యం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలి. నాకు విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచన లేదు. పార్టీని గెలిపించడమే నా పని అని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa