జార్జియాలోని ఓ ఇండియన్ రెస్టారెంట్లో దారుణం చోటు చేసుకుంది. ఉదయమే లేచి పగలంతా పనిచేసి అలిసీ సొలిసి పడుకున్న అక్కడి సిబ్బంది నిద్రలోనే చనిపోయారు. మొత్తం 12 మంది ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరి చావుకు కారణం ఏంటో కూడా తెలిసిపోయింది. ఆ పూర్తి విశేషాలు మీకోసం..!
జార్జియాలో ఓ ఫేమస్ రిసార్ట్.. గూడౌరి స్కై రిసార్ట్. ఇక్కడ అనేక దేశాలకు చెందిన రెస్టారెంట్లు ఉన్నాయి. అందులో ఒకటే ఇండియన్ రెస్టారెంట్. అయితే ఈ రెస్టారెంట్లో వివిధ దేశాలకు చెందిన 11 మంది పని చేస్తున్నారు. అలాగే ఓ జార్జియన్ కూడా పనిచేస్తున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు పని చేసి అలిసిపోయిన వీళ్లు రాత్రి 11 గంటలకు అలా నిద్రపోయారు. అయితే వారంతా మళ్లీ ఉదయం నిద్ర లేవలేదు. ఎంతసేపు అవుతున్నా ఇండియన్ రెస్టారెంట్ సిబ్బంది కిందకు రాకపోవడంతో రీసార్ట్ సిబ్బంది వారి గదికి వెళ్లారు.
వారంతా అక్కడే పడుకొని ఉండడం చూసి నిద్ర లేపారు. కానీ ఎంతకూ లేకపోవడంతో అనుమానం వచ్చి చూడగా వారంతా చనిపోయి కనిపించారు. దీంతో షాక్ అయిన ఆ సిబ్బంది.. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే మృత్యువాత పడ్డ ఆ 12 మంది నిద్రలోనే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
వారిని ఎవరూ హత్య చేయలేదని.. వారి మృతదేహాలపై ఎలాంటి గాయలు కూడా లేవని గుర్తించారు. అలాగే 12 మంది చనిపోవడానికి కారణాన్ని కూడా ప్రాథమిక విచారణలో గుర్తించారు. వీరంతా పడుకున్న సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడగా.. వాళ్లలో ఒకరు జనరేటర్ ఆన్ చేశారు. అది రాత్రంతా అలా నడుస్తూనే ఉంది. అయితే వీరు పడుకున్న గది చిన్నది కావడం, అక్కడంతా చీకటిగా ఉండడంతో జనరేటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వెలువడింది. అది గదంతా వ్యాపించగా.. అది పీల్చిన సిబ్బంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.
జార్జియా క్రిమనల్ కోడ్ చట్టం 116 కింద కేసు నమోదు చేసుకుని.. జార్జియా అంతర్గత మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టింది. ఇది నిర్లక్ష్యం వల్లే సంభవించే మరణాలను సూచిస్తుంది. అయితే పోస్టుమార్టం రిపోర్టులు వచ్చాక.. జనరేటర్ నుంచి వెలువడ్డ విష వాయువులే కారణమా, లేక మరేదైనా కారణమా ఉందా అని తెలుస్తుందని కూడా పోలీసులు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa