ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 07:23 PM

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  కాకినాడ పోర్టును పరిశీలించిన తర్వాత అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. స్టెల్లా షిప్ ద్వారా పీడీఎస్ బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో గత నెల 29న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా అధికారులతో కలిసి నౌకను పరిశీలించారు. రేషన్ బియ్యం తరలింపు విషయంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో అధికారులు రంగంలోకి దిగారు.ఐదు విభాగాల అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి స్టెల్లా షిప్‌లోని ఐదు కంపార్ట్‌మెంట్లలో తనిఖీలు నిర్వహించి 12 బియ్యం శాంపిల్స్‌ను సేకరించినట్లు జిల్లా కలెక్టర్ శాన్ మోహన్ తెలిపారు. స్టెల్లా షిప్‌లో 1320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు నిర్ధారించినట్లు చెప్పారు. ఈ బియ్యాన్ని అంతా సత్యం బాలాజీ అనే కంపెనీకి ఎగుమతి చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. వీరు ఎక్కడి నుంచి బియ్యాన్ని తీసుకువచ్చారు.. ఎక్కడ నిల్వ చేశారనే దానిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ కంపెనీపై విచారణ చేస్తున్నామన్నారు. ఈ బియ్యాన్ని షిప్ నుంచి ఆన్‌లోడ్ చేస్తామని తెలిపారు. ఇంకా 12వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉందని.. షిప్‌లో ఉన్న రేషన్ బియ్యం 48 గంటల్లో కిందకు దించేయాలన్నారు. ఆ తర్వాత మిగిలిన బియ్యం లోడ్ చేస్తామని కలెక్టర్ శాన్ మోహన్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa