ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 07:23 PM

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ  తెలిపింది. ప్రస్తుతం తమిళనాడు తీరం వైపు పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం కదులుతోందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.అల్పపీడన ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ (మంగళవారం) నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకట్రోండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు(బుధవారం) రోజు నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ఒకట్రోండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే బుధవారం నాడు కృష్ణ, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ వర్షాలు మూడ్రోజులపాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa