ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ అత్యాచార బాధితురాలు అబార్షన్ చేయించుకోవచ్చు: హైకోర్టు తీర్పు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 07:37 PM

అబార్షన్ చేయించుకోవడం చట్టపరంగా తప్పు. అది అందరికీ తెలిసిన విషయమే. అందుకే చాలా మంది చాటుమాటుగా గర్భస్రావం చేయించుకుంటారు. బయటకు వస్తే కేసులు అవుతాయని.. ఆస్పత్రులు కూడా గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తుంటాయి. అయితే చట్టపరంగా గర్భస్రావం చేయించుకోవాలనుకుంటే మాత్రం అటు తల్లి పరిస్థితో లేదా ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం బాగాలేని పక్షంలో మాత్రమే అబార్షన్ చేయించుకోవచ్చు. కానీ ఓ కేసులో ఇలాంటి సమస్యలు ఏమీ లేకపోయినా.. హైకోర్టు అబార్షన్ చేయించుకోవడానికి ఓ అమ్మాయికి అనుమతి ఇచ్చింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ 17 ఏళ్ల బాలిక ప్రస్తుతం 5 నెలల గర్భవతి. 20 వారాల శిశివు ఆమె కడుపులో పెరుగుతుంది. అయితే కొంతకాలంగా ఆమె మానసికంగా చాలా వేదనను అనుభవిస్తుంది. అందుకు కారణం ఆమె కడుపులో ఉన్న పిండమే. అదేంటీ అనుకుంటున్నారా ఆ అమ్మాయికి పెళ్లి జరిగి తల్లి అయి ఉంటే చాలా సంతోషంగానే గడిపేదేమో. కానీ ఆ అమ్మాయి పెళ్లి కాకుండానే తల్లి అయింది. అలా అని ఏ ప్రేమికుడి వల్లో అనుకునేరు.


ఆమె గర్భం దాల్చింది ఓ కామాంధుడి వల్ల. అవును ఆమె ఓ అత్యాచార బాధితురాలు. ఇటీవలే ఆ 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. కోర్టుకు కూడా తీసుకువెళ్లారు. ప్రస్తుతం నిందితుడు జైలుశిక్ష అనుభవిస్తుండగా.. బాలిక గర్భం దాల్చిన విషయం తెలిసింది. ప్రస్తుతం 20 వారాల గర్భస్త శిశివును కడుపులో మోస్తుందా బాలిక.


అయితే ఆమె తల్లి కావడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. విపరీతమైన మానసిక బాధతో రోజూ కుమిలిపోతుంది. దాని వల్ల ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా దెబ్బతింది. ప్రస్తుతం రక్తలేమి సమస్యతో బాధ పడుతోంది. ఈక్రమంలోనే ఆమె గర్భస్రావం చేయించుకోవడానికి హైకోర్టు అనుమతిని కోరింది. బాధితురాలి బాధను విన్న హైకోర్టు.. బాలిక అబార్షన్ చేయించుకోవడానికి అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పటికే ఆమె 5 నెలల గర్భవతి కావడంతో ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, గర్భస్రావం సాధ్యాసాధ్యాలను అంచనా వేయాలని బలోదబజార్-భటపరా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్‌ను ఆదేశించింది.


దీంతో బాలికకు అనేక పరీక్షలు చేసిన సీఎంహెచ్ఓ.. సికిల్ సెల్ వ్యాధి కారణంగా సదరు బాలిక తీవ్రమైన రక్తహీననతో బాధపడుతున్నట్లు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు.. ముందుగా బాలిలకు రక్తహీనతకు చికిత్స చేయాలని ఆ తర్వాతే గర్భస్రావం చేయాలని చెప్పింది. అత్యాచార బాధితురాలు.. తన గర్భాన్ని తొలగించుకునే అవకాశాన్ని నిరాకరించడం అంటే ఆమె స్వేచ్ఛ మరియు శారీరక స్వయంప్రతిపత్తిని ఉల్లంఘించడమేనని జస్టిస్ చంద్రవంశీ ఉద్ఘాటించారు. మైనర్‌ను గర్భం ఉంచుకోమని చెప్పడం బలవంతం అవుతుందని.. దాని వల్ల ఆమె మానసికంగా, శారీరకంగా మరింత కృంగిపోతుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa