మదనపల్లె పరిధిలోని నిమ్మనపల్లె మండల అభివృద్ధిలో అధికారులు కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే షాజహానబా షా సూచించారు. సోమవారం స్థానిక బెంగళూరు బస్టాండు వద్ద ఎమ్మెల్యే కార్యాలయంలో నిమ్మన పల్లె మండలానికి చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ పల్లెపండుగ కార్యక్రమంలో మండలంలో సీసీరోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటి పథకాల నిర్వహణ, ఓవర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్పై ఆర్డబ్ల్యూఎస్, పంచా యతీ కార్యర్ధులు దృష్టి సారించాలన్నారు. ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న వరిపంట వివరాలు నమోదు చేసి పంపాలని ఏవోను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత కనెక్షన్లు మంజూరు చేయడంలో ఎందుకు ఆలస్యమవుతోందని ఎస్పీడీసీఎల్ ఏఈని వివరణ అడిగారు. మండలంలోని ఆరు హైస్కూళ్లు, ఆరు ప్రాథమిక పాఠశాలల్లో 90 మంది విద్యార్థులు డ్రాపౌట్లుగా ఉన్నారని, వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని ఎంఈవోను ఆదేశించారు. ప్రతి రోజు ఒక పాఠశాలను తనిఖీ చేసి అక్కడ మధ్యాహ్న బోజనం పథకం అమలు, విద్యాబోధన, సమస్యల పై దృష్టి పెట్టాలన్నారు. శాంతిభద్రతల సమస్య, కేసుల నమోదు తదితర విషయాలపై ఎస్ఐ తిప్పేస్వామిని వివరాలు అడిగితెలుసుకున్నారు.. ఈ సమావేశంలో పీఆర్ డీఈ శివశంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మిథునచక్రవర్తి, ఏవో మురళీమోహన, ఎంఈవో పద్మావతి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa