ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ రచయితకి అరుదైన అవార్డు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2024, 02:40 PM

ప్రముఖ రచయిత పెనుకొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. "దీపిక" అభ్యుదయ వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ప్రస్తుతం పెనుకొండ లక్ష్మీనారాయణ అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన స్వగ్రామం పల్నాడు జిల్లా చెరువుకొమ్ముపాలెం. కాగా, లక్ష్మీనారాయణ దాదాపు 46 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘంలో వివిధ హోదాల్లో పని చేస్తూ వస్తున్నారు. ఆయన అనేక రకాల విమర్శనాత్మక గ్రంథాలు రచించారు. అనేక కథాసంపుటాలకు సంపాదకులుగా వ్యవహరించారు. పలు రాష్ట్ర మహాసభలకు నేతృత్వం వహించారు. ప్రస్తుతం లక్ష్మీనారాయణకు అవార్డు రావడంతో ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు అభినందనలు తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు, పలువురు ప్రముఖులు సైతం ఆయన్ను అభినందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa