ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగో టెస్టులో భారత్‌ ఓటమి

sports |  Suryaa Desk  | Published : Mon, Dec 30, 2024, 12:23 PM

మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన నాలుగో టెస్టులో 184ప‌రుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది.340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 155 పరుగులకు ఆలౌటైందిఆఖరి వరకు డ్రా కోసం భారత్ ప్రయత్నించినప్పటకి, ఆసీస్ బౌలర్లు అద్బుతంగా రాణించడంతో ఓటమి చవిచూడక తప్పలేదు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది


లక్ష్య చేధనలో ఆరంభంలోనే భారత్‌కు ఆసీస్ బౌలర్లు బిగ్ షాకిచ్చారు. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో టీమిండియా పడింది. ఈ సమయంలో యశస్వీ జైశ్వాల్‌, రిషబ్ పంత్‌​ అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొం‍టూ క్రీజులో నిలబడ్డారు. తొలి సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌.. రెండో సెషన్‌లో మాత్రం జైశ్వాల్‌, పంత్ విరోచిత పోరాటం వల్ల ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. కానీ మూడో సెషన్‌లో మాత్రం ఆసీస్ బౌలర్లు తిరిగి పంజా విసిరారు. అప్పటివరకు కుదురుగా ఆడిన పంత్‌..  ఆసీస్ పార్ట్‌టైమ్ బౌలర్ ట్రావిస్ హెడ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత భారత వికెట్ల పతనం మొదలైంది. జడేజా, నితీశ్ రెడ్డి వచ్చినవారు వచ్చినట్లగానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికి జైశ్వాల్ తన విరోచిత ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa