ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన సీఎస్‌గా విజయానంద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 30, 2024, 04:04 PM

రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలతోపాటు బలహీన వర్గాల అభివృద్దికి కృషి చేస్తానని విజయానంద్ ప్రకటించారు. ప్రస్తుత సీఎస్‌గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ సేవలు మరిచిపోకూడదని విజయానంద్ అన్నారు. వైయస్సార్ కడప జిల్లా, రాజుపాలెం మండలం, అయ్యవారిపల్లె ఆయన స్వస్థలం.. 2025 నవంబర్ వరకు విజయానంద్ సీఎస్‌గా కొనసాగనున్నారు. సీనియారిటీ ప్రకారం జలవనురుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ముందున్నారు. అయితే సాయి ప్రసాద్‌కు 2026 ఏప్రిల్ వరకు సర్వీసు ఉండడంతో ప్రభుత్వం విజయానంద్ వైపు మొగ్గు చూపింది.


సీనియర్ అయినా సాయి ప్రసాద్‌ను సీఎస్‌గా నియమిస్తే ఆయన పదవీకాలం ముగియకముందే విజయానంద్ రిటైర్ కానున్నారు. దీనితో ప్రభుత్వం సీఎస్‌గా విజయానంద్‌కు అవకాశం కల్పించింది. విజయానంద్ పదవీకాలం ముగిశాక సీఎస్‌గా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను నియమించే అవకాశం ఉంది. కాగా సీఎస్‌గా విజయానంద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చే ముందు ఇరువురిని పిలిచి తన నివాసంలో మాట్లాడి కలిసి పని చేసుకోవాల్సిందిగా సీఎం చంద్రబాబు వారికి సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa