దేశంలోనే పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన డేటా ప్రకారం.. దాదాపు రూ.931 కోట్లతో దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిలువగా రూ.15 లక్షల ఆస్తితో మమతా బెనర్జీ చివరి స్థానంలో ఉన్నారు. అలాగే ధనిక సీఎంలలో పెమా ఖండూ (అరుణాచల్) రూ.332 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో, మూడో స్థానంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిలిచారు.
31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి రూ.1,630 కోట్లు
ఏడీఆర్ నివేదిక ప్రకారం,రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.52.59 కోట్లుగా ఉంది.
ముఖ్యమంత్రుల సగటు వార్షిక ఆదాయం రూ.13,64,310గా ఉంది. 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి రూ.1,630 కోట్లుగా ఉంది.
సంపన్న ముఖ్యమంత్రులలో రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రూ.332 కోట్ల ఆస్తితో ఉన్నారు,అయితే ఆయనకు రూ.180 కోట్ల అప్పు ఉంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మూడో స్థానంలో రూ.51 కోట్ల ఆస్తులతో ఉండగా,ఆయనకు రూ.23 కోట్ల అప్పు ఉంది.
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ.55 లక్షల ఆస్తులతో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉన్నారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రూ.1.18 కోట్ల ఆస్తులతో అట్టడుగు నుంచి మూడో స్థానంలో నిలిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa