ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. తాజాగా.. విద్యార్థులకు మరో గుడ్న్యూస్ చెప్పింది. తర్వలో రాష్ట్రవ్యాప్తంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ వెల్లడించారు. 45 ఏళ్లు నిండిన గ్రామీణ ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
త్వరలోనే ఏపీ వ్యాప్తంగా 5-15 ఏళ్ల విద్యార్థులకు టెస్టులు నిర్వహించి 90 వేల కళ్లద్దాల పంపిణీ చేస్తామన్నారు. ఒక్క రూపాయి భారం మోపకుండా ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు కార్యచరణ రూపొందించాలని అధికారులను మంత్రి సత్య కుమార్ ఆదేశించారు. నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
ఇక ఏపీలోని దివ్యాంగ విద్యార్థులకు మరో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి గుడ్న్యూస్ చెప్పారు. వారికి ప్రతినెలా పింఛన్ను నేరుగా అకౌంట్లలోనే జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలను అందిస్తామని చెప్పారు. దివ్యాంగుల కోసం వైజాగ్లో 20 ఎకరాల్లో రూ.200 కోట్లతో స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు.
జూన్లో తల్లికి వందనం పథకం ఇక తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు ఏటా రూ.15 వేల ఆర్థిక సహాయం అందించేందుకు ఇటీవల ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికీ ఏటా రూ.15 వేలు అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి విద్యార్థికీ ఈ సాయాన్ని అందజేస్తామని సర్కార్ వెల్లడించింది. ఈ పథకం 2025 అకడమిక్ సంవత్సరం నుంచి అమలులోకి రానున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జూన్ నుంచి ఈ పథకం అమలులోకి వచ్చే ఛాన్స్ ఉంది. గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే తల్లుల ఖాతాలో రూ.10 వేలు జమ చేసేది. అయితే ఆ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచుతూ కూటమి నేతలు హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa