తిరుపతి తొక్కిసలాట మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు వహిస్తారా లేక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ లేక, టీటీడీ ఛైర్మన్ వహిస్తారా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటుంటారు, మరి ఇప్పుడు ఏమయ్యారు, పూర్తిగా పరిపాలనా వైఫల్యం వల్లే ఈ తప్పిదం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్పై పెట్టిన శ్రద్ద ప్రజల సమస్యలపై పెట్టలేదని ఫైర్ అయ్యారు. తిరుపతిలో జరిగిన మరణాలపై వెంటనే ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని విరూపాక్షి డిమాండ్ చేశారు. చంద్రబాబు తన పరిపాలనలో నన్ను మించిన వారు లేరంటారు, తొక్కిసలాట ఘన మీ పాలనా వైఫల్యం కాదా అని ఎమ్మెల్యే విరూపాక్షి ప్రశ్నించారు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్కళ్యాణ్ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం వల్ల ఇద్దరు యువకులు అన్యాయంగా బలయ్యారు, డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సాక్షాత్తూ దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చిన రోజే తిరుపతిలో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. హిందూ ధర్మం అన్న వారంతా ఏమయ్యారు, టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు ఏం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ ఎవరు రాజీనామా చేస్తారో చెప్పాలని ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa