భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులు జోరుగా ప్రచారం జరుగుతున్నవిషయం సంగతి తెలిసిందే. దీనిపై తొలుత ధనశ్రీ వర్మ స్పందించగా.. గంటల వ్యవధిలోనే యుజ్వేంద్ర చాహల్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
"అభిమానుల సపోర్ట్ లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. వారి ప్రేమకు థాంక్స్. అయితే ఈ ప్రయాణం.. 'ఓవర్'కి ఎంతో దూరంలో ఉంది. అయితే నా దేశం, జట్టు, అభిమానుల కోసం నేను ఇంకా ఎన్నో అద్భుతమైన 'ఓవర్స్' వేయాల్సి ఉంది. మీ అందరి కుమారుడిగా, సోదరుడిగా, స్నేహితుడిగా, ఒక క్రీడాకారుడిగా ఎంతో గర్వపడుతున్నా. ఇటీవల జరుగుతున్న ఘటనలు ముఖ్యంగా.. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుంటా. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నా దృష్టికి వచ్చింది. అయితే అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఇలాంటి ఊహగానాలను మీరు పట్టించుకోవద్దు. ఇదే నా రిక్వెస్ట్" అని చాహల్.. పోస్టు పెట్టాడు.
"ఇటీవల జరుగుతున్న ప్రచారం, ఊహాగానాలపై ఉండాలని.. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి నాకు నా కుటుంబానికి బాధ కలిగిస్తాయి. ఇతరుల మంచి కోరుకోవాలనే నా కుటుంబం నేర్పించింది. నేను కోరేది ఒక్కటే. మరు నాపై సానుభూతి చూపకండి. దాని బదలు మద్దతు తెలపండి" అని చాహల్ తన పోస్టులో చెప్పుకొచ్చాడు.
ధనశ్రీ వర్మ రియాక్షన్ ఇదే..
కాగా చాహల్ కంటే ముందే.. అతడి భార్య ధనశ్రీ వర్మ కూడా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలతో తాను మానసిక వేదనకు గురవుతున్నట్లు పేర్కొంది. నిజానిజాలు తెలుసుకోకుండా అసత్యం ప్రచారం చేస్తున్నారని తెలిపింది.
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల వివాహం 2020లో జరిగింది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ధనశ్రీ వర్మ ముంబైకి చెందిన డెంటిస్ట్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్. కరోనా లాక్డౌన్ సమయంలో చాహల్ ఆమె వద్ద డ్యాన్స్ నేర్చుకునేందుకు వెళ్లాడు. ప్రేమలో పడ్డాడు. అయితే పెళ్లయిన నాలుగేళ్ల పాటు కలిసి మెలిసి ఉన్న ఈ జంట మధ్య ఆరు నెలల నుంచి దూరం ఏర్పడినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ఫాలో చేసుకోవడం, ఫొటోలు డిలీట్ చేసుకోవడం వంటి చర్యలు విడాకుల ఊహాగానాలకు రేకెత్తించాయి. దీంతో వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోనున్నారని.. సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa