బంగ్లాదేశ్లో చాలా కాలంగా మైనార్టీలు, హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులపై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. అయితే ఈ దాడులన్నీ మతపరమైన దాడులు కావని రాజకీయ పరమైనవే అని.. తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కొన్ని కేసులు మాత్రమే మతపరవమైనవి అని అంగీకరించింది. 2024 నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో ఎన్ని కేసులు నమోదు అయ్యాయో కూడా వెల్లడించింది. అలాగే అందులో ఎన్ని మతపరమైన కేసులు ఉన్నాయి, మరెన్ని రాజకీయ పరమైన కేసులు ఉన్నాయో కూడా స్పష్టం చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల కారణంగా.. 2024 ఆగస్టు నెలలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు. ముఖ్యంగా 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికి భారత దేశానికి వలస వచ్చారు. ప్రస్తుతం ఆమె ఇక్కడే ఆశ్రయం పొందుతుండగా.. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రస్తుతం అధికారాలు చేపట్టారు. ఇక అప్పటి నుంచి బంగ్లాదేశ్లో మైనార్టీలు, హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి.
మైనార్టీ వర్గాలపై ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న ఈ దాడులు మతపరమైనవి కావని.. ఇందులో ఎక్కువ కేసులు రాజకీయ పరమైనవేనని తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 11వ తేదీ అంటే శనివారం రోజు విడుదల చేసిన ఈ ప్రకటనలో.. బంగ్లాదేశ్లో ఎన్ని కేసులు నమోదు అయ్యాయి, అందులో ఎన్ని మతపరమైన, రాజకీయపరమైన కేసులు ఉన్నాయో కూడా స్పష్టం చేసింది. ముఖ్యంగా 2024 ఆగస్టు నెలల నుంచి మొత్తం 115 కేసులు నమోదు కాగా.. 100 మందిని అరెస్ట్ చేసినట్లు బంగ్లా సర్కారు వెల్లడించింది.
ముస్లిం ఆధిపత్య దేశంలో... హిందూ, బుద్ధ, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్పై మొత్తం 1769 మతపరమైన దాడులు జరిగినట్లు వివరించింది. ఇందులో దాడులు, విధ్వంసం, దోపిడీ కేసులు ఉన్నాయని స్పష్టం చేసింది. వీటన్నిటిపై పోలీసులు కేసులు నమోదు చేయగా.. 1234 కేసులు రాజకీయ పరమైనవి అని తెలిపారు. కేవలం 20 కేసులు మాత్రమే మతపరమైనవిగా గుర్తించినట్లు వివరించారు. అలాగే మిగతా కేసులు అన్నీ అవాస్తవమైనవిగా పోలీసులు తేల్చినట్లు ప్రకటించారు.
ఇదంతా ఇలా ఉండగా.. బంగ్లాదేశ్లోని హిందు, బుద్ధ, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ తమపై గతేడాది మొత్తం 2, 010 మతపరమైన దాడులు జరిగినట్లు ఇటీవలే ఆరోపించింది. ఈక్రమంలోనే ఫిర్యాదుల కోసం పోలీసులు వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కారు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa