దేశీయ టెక్, ఐటీ ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతోంది? దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. చడీచప్పుడు కాకుండా ఉద్యోగులను తొలగిస్తున్నాయా? అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించి డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాలను ఐటీ కంపెనీలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటి వరకు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రాలు క్యూ3 ఫలితాలు ప్రకటించగా.. అందులో మూడు కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోవడం గమనార్హం.
జనవరి 17వ తేదీ శుక్రవారం మార్కెట్లు ముగిసిన తర్వాత టెక్ దిగ్గజాలు విప్రో, టెక్ మహీంద్రా సంస్థలు తమ క్యూ3 ఫలితాలను ప్రకటించాయి. విప్రో నెట్ ప్రాఫిట్ 24 శాతం పెరిగి రూ.3,354 కోట్లుగా నమోదు చేసింది. అయితే ఇదే సమయంలో ఉద్యోగుల వలసల రేటు 15.3 శాతానికి పెరిగినట్లు కంపెనీ తెలిపింది. అంతకు ముందు ఏడాది అది 14.2 శాతంగా ఉందని బీఎస్ఈ ఫైలింగ్లో తెలిపింది. అంటే ఈసారి భారీగా పెరిగినట్లు అర్థమవుతోంది. రెండో త్రైమాసికంతో పోలిస్తే విప్రో ఉద్యోగుల సంఖ్య ఏకంగా 1157 మేర తగ్గిపోయింది. ప్రస్తుతం కంపెనీలో 2,32,732 మంది పని చేస్తున్నారు.
టెక్ మహీంద్రా
మహీంద్రా గ్రూప్ టెక్ కంపెనీ టెక్ మహీంద్రా క్యూ3 ఫలితాల్లో నికర లాభం ఏకంగా 92.63 శాతం పెరిగి రూ.973.2 కోట్లుగా నమోదు చేసింది. కంపెనీ ఆదాయం రూ.13,285 కోట్లుగా చూపించింది. అయితే మూడో త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. కంపెనీలోని ఉద్యోగుల వలసల రేటు 11.2 శాతంగా ఉంది. గతేడాదితో పోలిస్తే 90 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. క్యూ2తో పోలిస్తే క్యూ3కి వచ్చే సరికి ఉద్యోగుల సంఖ్య 3785 తగ్గి 1,50,488కి పడిపోయింది.
రెండు కంపెనీల్లో కలిపి..
శుక్రవారం ఫలితాలు ప్రకటించిన విప్రో, టెక్ మహీంద్రాలో ఉద్యోగుల సంఖ్య గమనిస్తే దాదాపు 5 వేలు తగ్గింది. విప్రోలో క్యూ2తో పిలిస్తే 1157 మంది తగ్గిపోగా, టెక్ మహీంద్రాలో ఆ సంఖ్య ఏకంగా 3785 తగ్గింది. దీంతో మొత్తం 4,942 మంది ఉద్యోగులు తగ్గిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa