మలేషియా వేదికగా జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ 2025లో భారత్ బోణీ కొట్టింది. కౌలాలంపూర్ వేదికగా ఆదివారం వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ను భారత బౌలర్లు 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం టీమిండియా 4.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టోర్నీని విజయంతో ఆరంభించింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ నికీ ప్రసాద్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ స్వభావాన్ని బట్టి తొలుత బౌలింగ్ చేయడమే ఉత్తమమని భావించినట్లు పేర్కొంది. కెప్టెన్ అంచనాలకు తగ్గట్లుగానే భారత బౌలర్లు సత్తాచాటారు. భారత బౌలర్ల దెబ్బకి వెస్టిండీస్ ప్లేయర్లు.. పెవిలియన్కు క్యూ కట్టారు. ఆ జట్టు బ్యాటర్లలో ఓపెనర్ అసబి క్యాలెండర్ (12), కెనికా కాసర్ (15) మినహా మరే ప్లేయర్ కూడా రెండంకెల స్కోరు చేయలేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు ముగ్గురూ సున్నా చుట్టేశారు.
భారత బౌలర్లలో పరుణిక సిసోడియా 3, ఆయుశి శుక్లా 2, జోషిత్ వీజే 3 వికెట్లు పడగొట్టారు. వెస్టిండీస్ బ్యాటర్లలో ముగ్గురు రనౌట్ అయ్యారు. మొత్తంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు.
అనంతరం 45 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. అసలైన టీ20 ఆటను రుచిచూపించింది. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఫోర్ కొట్టిన త్రిష.. రెండో బంతికే ఔట్ అయింది. అయితే ఆ తర్వాత జి కమలిని (16), సనికా ఛల్కే (18) మ్యాచ్ను ముగించారు. భారత్ కేవలం 4.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బౌలర్ క్లాక్స్టన్ ఒక వికెట్ తీసింది.
ఈ విజయంతో భారత్ పాయింట్ల ఖాతాను తెరిచింది. 2 పాయింట్లతో పాటు భారీ రన్రేట్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో +8.646 నెట్ రన్ రేట్ ఉంది. ఈ టోర్నీలో భారత్ తన తర్వాతి మ్యాచ్లలో జనవరి 21న మలేషియాతో, 23న శ్రీలంకతో తలపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa