మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ఓ 20 ఏళ్ల అమ్మాయి.. తన తల్లిదండ్రులతో కలిసి నలసోపారా టౌన్షిప్లో నివాసం ఉంటోంది. ఇటీవలే ఈమెకు రాజ్ రతన్ అనే ఆటో డ్రైవర్ పరిచయం అయ్యాడు. ఈక్రమంలోనే అతడిపై మనసు పారేసుకుందీ అమ్మాయి. అతడికి కూడా ఈమె నచ్చగా.. ఇద్దరూ తరచుగా కలిసే వాళ్లు. ఈక్రమంలోనే వీరిద్దరూ శారీరకంగా కలవాలని భావించారు. జనవరి 20వ తేదీ రోజు అంటే సోమవారం రోజు రాత్రి ఇద్దరూ ఒక చోట కలిశారు.
ఆపై ఏదైనా హోటల్కి వెళ్లి ఫుల్లుగా ఎంజాయ్ చేయాలనుకున్నారు. అలా ఆర్నాలా బీచ్లోని గెస్ట్ హౌజ్ వద్దకు వెళ్లారు. కానీ అమ్మాయి వద్ద ఐడీ ప్రూఫ్లే లేకపోవడంతో.. వాళ్లు అనుమతించలేదు. ఎంతో ఆశగా వచ్చి నిరాశగా వెనుదిరగి వెళ్లడం ఇష్టం లేక.. అక్కడే ఏదో చోట కామవాంఛ తీర్చుకోవాలనుకున్నారు. బీచ్ వద్దే ఆటో నిలిపి అక్కడే ఇద్దరూ పడక సుఖం అనుభవించారు. ఇలా రాత్రంతా ఫుల్లుగా ఎంజాయ్ చేసిన ఈ జంట ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలోనే ఆటో డ్రైవర్ రాజ్ రతన్.. అమ్మాయిని తన ఇంటి వద్ద దింపేశాడు.
అయితే అక్కడకు వెళ్లిన వెంటనే యువతికి తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు. రాత్రంతా ఎక్కడికి వెళ్లావని అడిగితే ఏం చెప్పాలో తెలియక బయటే నిలబడిపోయింది. ఆటో డ్రైవర్తో గడిపిన విషయాన్ని అస్సలే వారికి తెలియనివ్వకూడదని ఓ వింత నాటకం ఆడింది. ముఖ్యంగా ఓ దుకాణానికి వెళ్లిన అమ్మాయి.. సర్జికల్ బ్లేడు కొనుగోలు చేసింది. దాన్ని తన ప్రైవేటు భాగంలో పెట్టుకుని.. ఆపై రాళ్లను కూడా జొప్పించుకుంది. అనంతరం రక్తస్రావం అవుతుండగానే.. దగ్గర్లోని రైల్వే స్టేషన్కు వెళ్లింది. అక్కడికి వెళ్లాక పోలీసులకు ఫోన్ చేసి తనపై అత్యాచారం జరిగిందని వివరించింది. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించారు.
బ్లేడు, రాళ్లు జొప్పించడంతో తీవ్ర రక్తస్రావమై.. అమ్మాయి విపరతీమైన నొప్పిని అనుభవించింది. ఈక్రమంలోనే చికిత్స చేసిన వైద్యులు ఆమె ప్రైవేటు భాగం నుంచి బ్లేడు, రాళ్లను బయటకు తీశారు. అయితే అత్యాచారం కేసు కావడంతో పోలీసులు బాధితురాలి వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. ఈక్రమంలోనే ఆమె ఒక్కోసారి ఒక్కో సమాధానం చెప్పడం చూసి షాక్ అయ్యారు. ముందుగా అమ్మాయి తనకు తండ్రి లేడని చెప్పింది. కానీ నాన్న ముందుకు రాగానే మళ్లీ మాట మార్చింది. దీంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. అప్పుడే అసలు నాటకాన్ని బయట పెట్టింది.
తన ఇష్టం ప్రకారం ఓ వ్యక్తితో గడిపానని.. అది అమ్మా, నాన్నలకు తెలియకూడదనే బ్లేడు, రాళ్లు ప్రైవేటు భాగంలో జొప్పించుకున్నట్లు వివరించింది. దీంతో షాకైన పోలీసులు ఆపై ఆటో డ్రైవర్ రాజ్ రతన్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని కూడా విచారించగా.. రాత్రి జరిగిందంతా చెప్పాడు. అలాగే అమ్మాయి గతంలోనూ ఇద్దరు యువకులపై ఇలాగే అత్యాచారం కేసు పెట్టిందని తెలుసుకని షాక్ అయ్యారు. కానీ బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa