ఏపీని లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అటు కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందుతూ ఉండటంతో నూతన విమానాశ్రయాల ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో ఐదుచోట్ల ఎయిర్పోర్టులు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో ప్రకాశం జిల్లా ఎయిర్పోర్టు కూడా ఒకటి. ప్రకాశం జిల్లాలో చిన్న విమానాలు ల్యాండయ్యేందుకు వీలుగా డొమెస్టిక్ టెర్మినల్ నిర్మించాలని సుమారు దశాబ్ద కాలానికి పైగా ప్రతిపాదన ఉంది. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిమాండ్ నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి.
మరోవైపు కొత్త ఎయిర్పోర్టును ఒంగోలు దగ్గరలో నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కొప్పోలు, ఆలూరు, అల్లూరు వంటి ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు అయితే అనువుగా ఉంటుందని రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఎయిర్పోర్టు అథారిటీ అధికారులు కూడా ఇటీవల స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. అయితే ఈ ప్రాంతంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయడానికి ఈ స్థలం సరిపోతుందా, ఎంతవరకూ అనుకూలంగా ఉందనే దానిపై టెక్నికల్గా అధ్యయనం జరపనున్నారు. నేల పటుత్వం సహా ఇతరత్రా అంశాలపై సాంకేతిక పరిశీలన జరిపిన తర్వాతే ఎయిర్పోర్టును ఏర్పాటు చేసే ప్రాంతంపై క్లారిటీ వస్తుంది.
మరోవైపు ఒంగోలు విమానాశ్రయం కోసం.. గతంలో 3,150 ఎకరాల భూమి కేటాయించారు. వాటికి సరిహద్దులు కూడా నిర్ణయించారు. ఇందులో 3000 మీటర్ల మేర రన్వే నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఈ భూములలో ఎక్కువగా వాన్పిక్ భూములు ఉండటం.. ఆ తర్వాతి కాలంలో వాటిని కూడా ఈడీ అటాచ్ చేయడంతో డొమెస్టిక్ టెర్మినల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. చిన్న విమానాలు దిగే విధంగా 600 ఎకరాల్లో ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు స్థలాన్ని పరిశీలించారు,
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa