ప్రపంచ స్థాయి దిగ్గజ ఆటో మేకర్ ఏకంగా 80 వేల కార్లను రీకాల్ చేసింది. ముందు ప్రయాణికుల సీటు కింద నేల వైరింగ్ దెబ్బతింటుందని గుర్తించింది. ఈ కారణంగా ఎయిర్ బ్యాగ్లు, సీట్ బెల్టులు సరిగా పని చేయకుండా మారుతున్నట్లు తెలిపింది. దీంతో కార్లను వెనక్కి రప్పించి సమస్యను పరిష్కరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ రీకాల్ అనేది అమెరికాలో ఉంటుంది. కియా అమెరికా ఈ మేరకు ప్రకటన చేసింది. అయితే, భారత్లోనూ కియా కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఏ కార్లలో సమస్య తలెత్తిందనే విషయాన్ని భారతీయ కస్టమర్లు సైతం తెలుసుకోవడం ఎంతో అవసరం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
సీటు కింద ఉండే వైరింగ్ డ్యామేజ్ కావడంతో సడెన్గా ఎయిర్బ్యాగ్ తెరుచుకునే ప్రమాదం ఏర్పడుతోందని కియా అమెరికా తెలిపింది. ఈ మేరకు అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సెఫ్టీ అడ్మినిస్ట్రేషన్కి దాఖలు చేసిన పత్రాల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. 2023 నుంచి 2025 మధ్య తయారైన నీరో ఈవీ, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ , హైబ్రిడ్ వెహికల్స్ మొత్తంగా 80,255 కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు పేర్కొంది. స్థానిక కియా డీలర్ల వద్దకు వెళ్లినట్లయితే వారు పరిశీలించి సమస్య ఉన్న వాటిని తొలగించి కొత్తవి ఫిక్స్ చేస్తారని, ఇది పూర్తి ఉచితంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అలాగే వైరింగ్ కవర్స్ సైతం ఏర్పాటు చేస్తారని తెలిపింది. ఈ మేరకు వచ్చే మార్చి నెలలో కార్ల ఓనర్లకు ఇ-మెయిల్ ద్వారా వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.
గత ఏడాది నవంబర్, 2024లోనూ రెండు దిగ్గజ సంస్థలు రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. అందులో హ్యూందాయ్ మోటార్స్, కియా కంపెనీలు ఉన్నాయి. అవి మొత్తంగా 208,000 ఎలక్ట్రిక్ కార్లను వెనక్కి పిలిపించాయి. ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్లోని ట్రాన్సిస్టర్ మార్చేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అది 12 వోల్ట్ బ్యాటరీ ఛార్జీంగ్ నిరోధిస్తున్నట్లు గుర్తించిన క్రమంలో రీకాల్ చేశాయి. ఆ ట్రాన్సిస్టర్ పాడవడంతో డ్రైవ్ పర్ కోల్పోయి రోడ్డు ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ట్రాన్సిస్టర్ మార్పులు చేపట్టాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa