భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్లో భాగంగా మంగళవారం (జనవరి 28) మూడో మ్యాచ్ జరగనుంది. రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ సిరీస్లో నిర్ణయాత్మక మ్యాచ్ కానుంది.ఎందుకంటే 5 మ్యాచ్ల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లను టీమిండియా కైవసం చేసుకుంది. ఇప్పుడు రాజ్కోట్లో కూడా భారత జట్టు గెలిస్తే 3-0తో సిరీస్ను కైవసం చేసుకుంటుంది. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఇంగ్లండ్ తప్పక గెలవాలి. దీంతో మూడో టీ20 మ్యాచ్ ఇంగ్లిష్ జట్టుకు డూ ఆర్ డై మ్యాచ్. దీంతో రాజ్కోట్ వేదికగా జరగనున్న మూడో టీ20 మ్యాచ్లో ఇరు జట్ల నుంచి హోరా హోరీ పోరును ఆశించవచ్చు. నిరంజన్ షా మైదానంలో జరగనున్న 3వ టీ20 మ్యాచ్లో టాస్ ప్రక్రియ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ను కూడా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే, డిస్నీ హాట్స్టార్ యాప్, వెబ్సైట్లో ఉచిత లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.
కాగా ఈ కీలక మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే తమ ప్లేయింగ్ ఎలెవన్ ను ప్రకటించింది. మొదటి రెండు మ్యాచ్ల మాదిరిగానే, ఇంగ్లండ్ ఇప్పటికే మూడవ మ్యాచ్కు ప్లేయింగ్ ఎలెవన్ని ప్రకటించింది. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇంగ్లండ్ జట్టు అదే 11 మంది ఆటగాళ్లను చెన్నైలోనూ, రాజ్కోట్లోనూ ఆడించాలని నిర్ణయించుకుంది. నిజానికి తొలి రెండు మ్యాచ్ల్లో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా ఓపెనర్లిద్దరూ ఎలాంటి అద్భుతమైన ప్రదర్శనను కనబరచడంలో ఇబ్బంది పడ్డారు. అందుకే మూడో మ్యాచ్కి ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగంలో మార్పు వస్తుందని భావించారు. అయితే ఇంగ్లండ్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa