ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిశుధ్య కార్మికులకి న్యాయం చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 04:22 PM

మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తున్న ఇద్దరిని వెంటనే సస్పెండ్‌ చేయాలని మదనపల్లె మున్సిపల్‌ వైస్‌చైర్మన జింకా వెంకటాచలపతి డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక మున్సిపల్‌ కౌన్సిల్‌హాల్లో చైర్‌పర్సన మనూజ అధ్యక్షతన కౌన్సిల్‌ సాధారణ సమావేశం నిర్వహించారు. కాగా అజెండాలోని అంశాలను ప్రస్తావిస్తూ వైస్‌చైర్మన జింకా వెంకటాచలపతి మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్య కార్మికులకు ఉదయం 5గంటలకు మస్టర్లు వేసేటప్పుడు పర్యవేక్షణ కొరవడిందన్నారు. కొందరు యూనియన లీడర్లంటూ వచ్చి హాజరుకాని కార్మికుల పేర్లు రిజిస్టర్‌ ఎక్కిస్తూ వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. హాజరైన వారికి గైర్హాజరు వేసి డబ్బులు డిమాండ్‌ చేస్తు న్నారని, తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని వారిని సస్పెండ్‌ చేయాలని చైర్‌పర్సనను కోరారు.


కార్మికులకు సరఫరా చేసే కొబ్బరినూనె, సోపులు ఏ బ్రాండ్‌వి పంపిణీ చేస్తారో అజెండాలో తెలపలేదని, ఇవి సరఫరా చేసే కాంట్రాక్టర్‌ పేరు, వివరాలు అజెండాలో పొందుపరచకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కౌన్సిలర్‌ బీఏ ఖాజా మా ట్లాడుతూ దక్నీపేటలోని మటన మార్కెట్‌ నుంచి ఆరేళ్లుగా అద్దెలు వసూలు చేయలేద ని దీని వలన మున్సిపాలిటికి రూ.50లక్షల ఆదాయం కోల్పోయిందని వాపోయారు. గాంధీరోడ్డులో ఆర్‌ఆండ్‌బీ స్థలాన్ని పరిరక్షించాలని కౌన్సిలర్‌ ఫర్జానా కోరగా, పట్టణంలో వీధి కుక్కల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని వైస్‌చైర్మన నూర్‌ఆజమ్‌సూచించారు. వీటిపై మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల మాట్లాడుతూ 272 మంది పారిశుధ్య కార్మిలకు ఎప్‌ఆర్‌ఎస్‌ ద్వారా మస్టర్‌ వేసేందుకు చర్యలు తీసుకుంటామని, కార్మికులకు పంపిణీ చేసే కొబ్బరినూనె, సోపులను ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్లు పిలిచి, నాణ్యమైన వస్తువులను కౌన్సిల్‌కు చూపించి కార్మికులకు పంపిణీ చేస్తామన్నారు. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని కౌన్సిలర్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాగా చైర్‌పర్సన మనూజ మాట్లాడుతూ పట్టణంలో 89 చోట్ల రూ.13.5 కోట్ల జనరల్‌ ఫండ్స్‌తో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. పారిశుధ్య పనులు, వీధిదీపాల మరమ్మతులు చేయించడంతో పాటు 2 నుంచి 3 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఈ సమావేశంలో కౌన్సిలర్లు తులసి, రాధమ్మ, రజని, లత, నాగార్జునబాబు, ప్రసాదబాబు, కో ఆప్షన సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa