ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటవీ భూములు ఆక్రమణపై అధారాల సేకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 04:22 PM

చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములని ఆక్రమించారంటూ వస్తున్న కథనాలపై  ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలపై అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేరడంపై ఇప్పటికే ప్రాధమిక నివేదిక ముఖ్యమంత్రికి చేరింది. ఈరోజు సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. నేటి సమీక్షలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ మాఫియా ఆగడాలు, తదుపరి చర్యలపై ప్రభుత్వం చర్చించనున్నారు. అటవీ భూములు ఆక్రమణ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాధమిక నివేదిక చేరింది. పుంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలంలో రికార్డుల తారుమారుతో, బినామీ పేర్లతో వందల ఎకరాల ఆక్రమణకు పాల్పడినట్లు పెద్దిరెడ్డి ఆరోపణలు ఉన్నాయి. పక్కా అధారాల సేకరణతో కఠిన చర్యలకు తీసుకునేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa