రాష్ట్రంలోని మదర్సాల్లో సర్వశిక్ష అభియాన్కు అనుబంధంగా విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులకు పెండింగ్ వేతనాల చెల్లింపు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రులు పేర్కొన్నారు. మదర్సాల్లో సామాన్య, సాంఘికశాస్త్రం బోధించే ఉపాధాయులు మంగళవారం అమరావతి సచివాలయంలో మంత్రిని కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. గత ఐదు సంవత్సరాలుగా తమకు జీతాలు ఇవ్వలేదని, ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, వాటిపై ప్రజల అభిప్రాయాలు, సంతృప్తి తదితరాల గురించి మైనార్టీ, బీసీ, సాంఘిక సంక్షేమశాఖల మంత్రులు చర్చించారు. మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మంగళవారమిక్కడ సమావేశమయ్యారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటు న్న చర్యలు క్షేత్రస్థాయిలో ప్రజల చెంతకు చేరే విధంగా సమష్టిగా ముం దుకు సాగాల్సిన అవసరం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa