శ్రీకాకుళం నగరంలోని 31వ వార్డు.. హెచ్బీ కాలనీలో మంగళవారం నిర్వహించిన ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. డివిజన్ ఇన్ఛార్జి విభూది సూరి బాబు సహకారంతో నిర్వహించి న ఈ కార్యక్రమంలో స్థానిక సాయినగర్ కాలనీ, దండి వీధి, పట్నాయకుని కాలనీ, మండల వీధి ప్రజలు పెద్ద ఎత్తు న పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, కార్పొ రేషన్ కమిషనర్ ప్రసాదరావులు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా కేంద్ర మంత్రికి విన్నవించు కున్నారు. ప్రతి సమస్యపై కేంద్రమంత్రి స్వయంగా స్పందిస్తూ.. అధికారులకు సూచనలిస్తూ... తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం తదితర సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున మంత్రికి, ఎమ్మెల్యేకు విన తులు అందజేశారు. వీటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావును కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa