శ్రీకాకుళం జిల్లాలో ఆరు కేంద్రాల్లో దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ల పునఃపరిశీలన చేపడుతున్నట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డా.కల్యాణ్ బాబు అన్నారు. మంగళవారం నరసన్నపేట సామాజిక ఆసుపత్రిలో సదరం కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిమ్స్ సర్వజన ఆసుపత్రి, నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రుల్లో ప్రతీ సోమవారం నుంచి బుధవారం వరకు 31,548 మంది పింఛన్ పొందుతున్న వారి సర్టిఫికేట్లు పరిశీలించనున్నా మన్నారు.
బెడ్రెస్ట్లో ఉన్న 15 వేల మంది దివ్యాంగులను పరిశీలించడం జరిగిందన్నారు. 12 మంది ఇతర జిల్లాల వైద్యుల ఆధ్వ ర్యంలో సదరంలో సర్టిఫికేట్లు పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఓపీ సేవలు, ఇతర సేవలను పరిశీలించారు. వైద్యులు యూ నిఫారం ధరించాలని, సిబ్బంది గుర్తింపు కార్డులు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసబాబు, ఏడీ శేషగిరిరావు, ఏవో రమణమూర్తి, వైద్యులు భార్గవ్, సూర్యప్రకాశరావు, రమేష్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa